ఐటమ్ బాంబ్ రాఖీసావంత్, సంచలన వ్యాఖ్యలు చేయడంలో దిట్ట. అసలు రాఖీసావంత్ పేరే సంచలనం. ఆమె ఏం చేసినా అది మీడియాలో సంచలనమయ్యేది ఒకప్పుడు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాఖీసావంత్, ఐటమ్ బాంబ్ కన్నా పబ్లిసిటీ స్టంట్స్ స్పెషలిస్ట్గానే ఎక్కువ గుర్తింపు పొందింది.
అలాంటి రాఖీసావంత్ ఇప్పుడు రాజకీయాలపై దృష్టి సారించింది. భారతీయ జనతా పార్టీలో చేరాలని ఉవ్విళ్ళూరిన రాఖీసావంత్, కొత్త పార్టీ పెట్టాలనుకుంటోందట. సన్నిహితులతో ఈ మేరకు రాఖీసావంత్ మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. తెలుగులోనూ ఓ సినిమాలో రాఖీసావంత్ ఐటమ్ గర్ల్గా కన్పించింది లెండి.
దేశవ్యాప్తంగా తనకు పెద్ద సంఖ్యలో అభిమానులున్నారనీ, వారి ఓట్లు తనకు పడితే, రాజకీయంగా ఎదుగుతాననీ అనుకుంటోంది రాఖీసావంత్. అయితే పార్టీ పెట్టడం రిస్క్ అనీ, దానికన్నా ఏదో ఒక పార్టీలో చేరడం బెటర్ అనీ సన్నిహితులు రాఖీసావంత్కి సలహాలిస్తున్నారట.
ఆల్రెడీ బీజేపీ నేతలతో టచ్లో వున్న రాఖీసావంత్, కొత్త పార్టీ సంగతి పక్కన పడేసి, బీజేపీలో చేరిపోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాఖీసావంత్ ఎప్పుడెలా వ్యవహరిస్తుందో ఎవరూ చెప్పలేం, ఇప్పుడు వేరే పార్టీలో చేరాలనుకున్నా.. ఆ తర్వాత మనసు మార్చుకుని కొత్త పార్టీ పెట్టేసినా పెట్టేయొచ్చని రాఖీ సన్నిహితులు ఆఫ్ ది రికార్డ్ వ్యాఖ్యానిస్తున్నారట బాలీవుడ్లో. అదీ సంగతి.
0 comments:
Post a Comment